తుఫాన్‌తో ఆర్టీసీకి రూ.29.73 లక్షల నష్టం

తుఫాన్‌తో ఆర్టీసీకి రూ.29.73 లక్షల నష్టం

KMM: మోంథా తుపాన్ ప్రభావం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీపై పడింది. ఏడు డిపోల నుంచి 127 బస్సు సర్వీసులను నిలిపివేయగా, సంస్థ రూ.29,73,145 ఆదాయాన్ని కోల్పోయింది. అత్యధికంగా సత్తుపల్లి డిపోకు రూ.7,86,718, కొత్తగూడెం రూ.6,13,620, ఖమ్మం రూ.5,03,447, భద్రాచలం రూ.4,66,051, మధిర రూ.2,30,800, ఇల్లందు రూ.2,01,702, మణుగూరు రూ.1,70,805 నష్టం వాటిల్లింది.