VIDEO: 'విద్యాశాఖ కమిషనర్ వైఖరి మారాలి'
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలోని ఉపాధ్యాయులు కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు మాట్లాడారు. ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ కమిషనర్ వైఖరి మారాలని కోరారు. హైస్కూల్ ప్లస్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.