దేవరకొండలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ: జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 కేంద్రాలలో మొత్తం 1,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.