జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ
NGKL: ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. సరైన పత్రాలు లేకపోయినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసినా, అతి వేగానికి పాల్పడినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.