ఇక్కడ పల్లె వెలుగులే ఎక్స్ప్రెస్లు!

NLG: ఆర్టీసీ అధికారుల తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనేక డిపోలో పల్లె వెలుగు బస్సులకు ముందు, వెనుక భాగంలో రంగులు వేసి బోర్డు మార్చి ఎక్స్ప్రెస్లుగా నడుపుతున్నారు. పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులపై పెనుభారం మోపుతున్నారు.