బనగానపల్లెలో మంత్రి బీసీ సుడిగాలి పర్యటన
NDL: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. డ్రైనేజీ, రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోయిన బాధితుల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేసి బాధితులకు సకాలంలో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. షాదీఖానా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.