మంగినపూడి బీచ్కు భారీ పెట్టుబడి
కృష్ణా: మంగినపూడి బీచ్లో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన మైరాబే వ్యూ రిసార్ట్స్ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా తాళ్లపాలెంలో 20 ఎకరాల్లో రూ. 157.53 కోట్లతో లార్జ్ అమ్యూజ్మెంట్ పార్క్ కం రిసార్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు వాటర్ పార్క్ & రైడ్లు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయబడతాయి.