క్రికెట్ బెట్టింగ్కు యువత దూరంగా ఉండాలి: ఎస్సై
WGL: ఐపీఎల్ నేపథ్యంలో యువత క్రికెట్ బెట్టింగ్స్కు దూరంగా ఉండాలని ఎస్సై సాయి బాబు సూచించారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణంలో వారు మాట్లాడుతూ తక్షణ లాభాల ఆశతో అక్రమ మార్గాల్లోకి వెళ్లడం వల్ల ఆర్థిక నష్టం, అప్పులు, మానసిక సమస్యలు ఎదురవుతాయని. బెట్టింగ్ పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.