వార్డు సమస్యలపై వినతి
VSP: విశాఖ జీవీఎంసీ 48వ వార్డులో మౌలిక వసతులు కల్పించి, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆ వార్డు కార్పొరేటర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ను కోరారు. మంచినీటి పైప్లైన్ల కోసం తవ్వి అసంపూర్ణంగా వదిలేసిన రోడ్ల పనులు పూర్తి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.