11 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అబూజ్మడ్లోని దుర్గం ఏరియాకి చెందిన మావోయిస్టులు ఎస్పీ రాబిన్సన్ గుడియా ముందు ఆయుధాలు వదిలేశారు. కాగా కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న క్రమంలో గత కొద్ది రోజులుగా పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగుబాటులకు సిద్ధమవుతున్నారు.