హాస్పిటల్‌కు వెళ్లి పింఛన్ అందజేత

హాస్పిటల్‌కు వెళ్లి పింఛన్ అందజేత

శ్రీకాకుళం: టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అన్నెపు ప్రకాశరావు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీ జి. యశోదకృష్ణ హాస్పిటల్‌కు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.