'తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలి'
SRPT: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కళాశాలల విద్యార్థులతో కలిసి శనివారం సూర్యాపేటలోని ప్రధాన వీధుల గుండా నిరసన ప్రదర్శన నిర్వహించారు.