పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: CITU
శ్రీకాకుళం: పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. సిలిండర్ పెట్టి పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలని నినాదించారు.