తాగునీటి కోసం ముందస్తు చర్యలు
KRNL: తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్లెల్సీకు నీటి విడుదల నేపథ్యంలో ఆదోని మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ బసాపురం కాలువను ఇవాళ పరిశీలించారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసి ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు. నీటి నిల్వపై ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ, డీఈలు పాల్గొన్నారు.