వాంఖడే పిచ్పై బ్యాటర్లకు పండగే..!
రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సూపర్-8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ ఇదే స్టేడియంలో 254/6 పరుగులు చేసింది. దీంతో రేపటి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, ఈ పిచ్పై యావరేజ్ స్కోరు 177.