VIDEO: రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల గొడవ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో టీడీపీ నాయకులు మధ్య ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ కేంద్రంలోని అన్న క్యాంటీన్ వద్ద టీడీపీ నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి దాడులకు దిగారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజున సందర్భంగా నిన్న అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేసిన విషయం తెలిసిందే. అన్న క్యాంటీన్లో అన్నదానానికి హాజరైన తెలుగు తమ్ముళ్లు గొడవ పడ్డారు.