VIDEO: పెరిగిన ఏసీ మిర్చి.. తగ్గిన నాన్ ఏసీ మిర్చి, పత్తి ధర

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ కమిటీ సభ్యుల వివరాల పరకారం.. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.14,550, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,600, క్వింటా పత్తి ధర రూ.7,700 జెండా పాట పలికాయి. నిన్నటితో పోలిస్తే.. ఏసీ మిర్చి ధర రూ.50 పెరగగా.. నాన్ ఏసీ మిర్చి రూ.200, పత్తి ధర రూ.200 తగ్గినట్లు పేర్కొన్నారు.