పాక్పై భారత్ దాడి.. స్పందించిన ట్రంప్

పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై US అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. 'ఇది సిగ్గుచేటు విషయం. దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తివంతమైన దేశాలు కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. భారత్, పాక్కు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు' అని అన్నారు.