ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

కృష్ణ: ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, అలాగే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు పాల్గొనవచ్చన్నారు. అర్హత గల యువత అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.