గంగాభవాని తిరుణాలకు సదుపాయాల కోరిక
ఉయ్యాలవాడలో ఈనెల 25 నుంచి జరగనున్న గంగాభవాని తిరుణాల నిర్వహణకు అధికారులు సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావును గ్రామ పెద్దలు కలిసి వినతిపత్రం ఇవాళ అందజేశారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పోలీస్ బందోబస్తు, రవాణా సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.