'రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి'

WNP: కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూన్ 5 లోపు పట్టా పాస్ పుస్తకం పొంది ఆధార్ కార్డు ప్రకారం 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల పట్టాదారులు ఆగస్టు 13 లోపు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కురుమయ్య అన్నారు. తదుపరి వివరాల కోసం వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు. ఇది వరకే దరఖాస్తు చేసుకున్న రైతులు మరల దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.