భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన జడ్జి

భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన జడ్జి

SRD: సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భరోసా కేంద్రంలో బాధిత మహిళలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలికలు, మహిళలకు అండగా ఉండాలని సూచించారు. మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.