పది పరీక్షలకు సర్వం సిద్ధం: DEO
SKLM: జిల్లాలో సోమవారం నుండి ఏప్రిల్ 1 వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో ఏ.రవిబాబు ఆదివారం తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి 28,598మంది విద్యార్థులు 145 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరందరికీ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం ఉందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు.