'ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి'

'ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి'

E.G: PGRSలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 27 వినతులు అందాయి. ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.