కలెక్టర్ను కలిసిన అదనపు ఎస్పీ
MDK: జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రతిమ సింగ్ను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు, అభివృద్ధి సంక్షేమంపై విషయంలో చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.