పెట్రోల్ కొరతతో అవస్థలు ఆడుతున్న వాహనదారులు
ASR: చింతపల్లిలో పెట్రోల్ కొరతతో బంకుల వద్ద వాహనదారులతో భారీ రద్దీ పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలపై భయాందోళనల నేపథ్యంలో చింతపల్లి మండలంలోఇంధన సంక్షోభ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచే మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కూడా గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.