చివరి దశకు మల్లన్న రైల్వే స్టేషన్ పనులు

చివరి దశకు మల్లన్న రైల్వే స్టేషన్ పనులు

SDPT: కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేలాదిగా భక్తులు దర్శనార్థం HYD నుంచి రోజూ కొమురవెల్లి వెళ్తుంటారు. ఈ  నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుంది.