శ్రీశైలంలో రోడ్డుపైకి కొండచిలువ
KRNL: శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం సమీపంలో కొండ చిలువ కలకలం రేపింది. సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డుపైకి కొండ చిలువ వచ్చే సమయంలో జనాల అలజడికి తిరిగి అటవీ ప్రాంతంలోకే వెళ్లిపోయినట్లు భక్తులు తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా శ్రీశైలంలో పులులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల్లో సంచరిస్తున వస్తున్న విషయం తెలిసిందే.