ఎస్ఎఫ్ఐ జిల్లా కొత్త కమిటీ ఏర్పాటు
అనకాపల్లి ఎస్ఎఫ్ఐ కొత్త జిల్లా కమిటీ ఏర్పాటు అయింది. జిల్లా కన్వీనర్గా కె విజయ్, కో కన్వీనర్గా ఎం బాలాజీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ.. అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.