ఆదోనిలో పోషణ పక్వాడ్ కార్యక్రమం
KRNL: ఆదోనిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 42 గ్రామాల అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర నిధులతో అంగన్వాడీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లి, శిశువులకు నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.