పాలవాహనం బోల్తా... ఇద్దరికీ గాయాలు

పాలవాహనం బోల్తా... ఇద్దరికీ గాయాలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లిగడ్డ సమీపంలో సోమవారం ఉదయం పాల వాహనం బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట నుంచి హుజురాబాద్‌కు వెళ్తున్న పాల వ్యాను వెనుక టైరు ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి, రోడ్డు ప్రక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.