మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సునీత సమీక్షా
సత్యసాయి: కనగానపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండల అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్షించారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ పనులలో భాగంగా కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి, ఇంటి స్థలాలు అవసరమైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వచ్చే వేసవిలో గ్రామాలలో త్రాగు నీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.