రేపు భారత్ బంద్
దేశవ్యాప్తంగా రేపు బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నట్లు తెలిపింది. చికిత్స కోసం విజయవాడకు వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఆరోపించారు. కాగా బంద్ పిలుపు నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.