'అమరావతి బిల్లు ఆమోదం.. జగన్కు చెంపపెట్టు'
AP: రాజధానిపై జగన్ వక్రబుద్ధి మారదని మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. 'తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్.. రాష్ట్రానికి న్యాయం చేస్తారా? రాష్ట్రానికి జగన్ న్యాయం చేస్తానంటే.. హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాశ్వతం.. అమరావతి నిత్యశాశ్వతం. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. జగన్కు చెంపపెట్టు' అని పేర్కొన్నారు.