BREAKING: టీమిండియా ఘోర ఓటమి
ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్టులో భారత అమ్మాయిల జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. తొలి ఇన్నింగ్స్లో జెమీమా(52), రెండో ఇన్నింగ్స్లో ప్రతిక(63) మినహా భారత ప్లేయర్లంతా బ్యాటింగ్లో చేతులెత్తేశారు. ఆసీస్ తరఫున సదర్లాండ్(129) సెంచరీతో, 6 వికెట్లతో ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. దీంతో టెస్ట్ సిరీస్ కూడా కంగారూల సొంతమైంది.