ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్

NLG: నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని విద్యుత్ ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. 11 కేవీ లైన్ షిఫ్టింగ్, రోడ్డు విస్తరణ పనుల కారణంగా మిర్యాలగూడ రోడ్డు, బీటీఎస్, శ్యామసానగర్, భారత్ గ్యాస్ ఏరియా, దారుపాషా కాలనీలలో విద్యుత్ సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.