వైకుంఠ ద్వార దర్శనాలు.. భారీగా రిజిస్ట్రేషన్లు
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో ఈ-డిప్కు మొత్తం 17.40 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. DEC 1వ తేది వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. ఈ-డిప్ టోకెన్లు పొందిన భక్తులకు DEC 2న ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది.