సింహాద్రి అప్పన్నకు స్వర్ణపుష్పార్చన

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నస్వామి స్వర్ణ పుష్పార్చన ఆదివారం వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామిని అదిష్టించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణపుష్పార్చన జరిగింది.