నాణ్యత ప్రమాణాలు లేని రోడ్డు నిర్మాణ పనులు
కృష్ణా: పెడన మండలంలో గురివిందగుంట నుంచి కవిపురం వరకు నిర్మించిన బీటీ రోడ్డు అప్పుడే ఛిద్రం అయింది. ఎన్ఆర్ఇజిఎస్ నిధులు సుమారు రూ. 80 లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్డు నిర్మాణం చేశారని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు.