'రైతులు కొత్త పద్ధతులు అవలంబించండి'
SKLM: పాతపట్నం రైతు సేవా కేంద్రంలో రైతన్నా మీ కోసం వర్క్షాప్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాలు, పంచసూత్రాల అమలు విధానం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతల పై రైతులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. రైతులు కొత్త పద్ధతులను అవలంబిస్తే ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందన్నారు.