నేడు శృంగవరాన్ని సందర్శించనున్న కేంద్ర బృందం
AKP: నాతవరం మండలం శృంగవరం గ్రామాన్ని ఇవాళ కేంద్ర బృందం సందర్శించనుంది. వాట్స్యాప్ గవర్నెన్స్, స్వర్ణ పంచాయితీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీస్తుందని అధికారులు తెలిపారు. గుడ్ గవర్నెన్స్లో ఈ గ్రామం జాతీయ పోటీలకు ఎంపికైంది. విజేతగా నిలిస్తే గ్రామానికి రూ.కోటి బహుమతి వస్తుంది. ఈ మేరకు సర్పంచ్, కార్యదర్శిని ఢిల్లీలో రాష్ట్రపతి సత్కరిస్తారు.