CM వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
సత్యసాయి: రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై CM చంద్రబాబు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, JC మౌర్య భరద్వాజ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.