శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
SRD: సంగారెడ్డి జిల్లాలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి పర్వదినం పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.