మత్స్యసంపదకు అంతరాయం.. మత్స్యకారుల ఆవేదన
E.G: జిల్లాలో సాధారణంగా మత్స్యకారులకు జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఉపాధికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం వరదల సీజన్ కావడంతో ఎర్రనీరు సముద్రంలో కలుస్తోంది, కావున వేటాడేందుకు వీలుండదు. గోదావరి నదీపాయల్లో వేటాడే మత్స్యకారులు సుమారు 10 వేల మంది వరకు ఉన్నారు. వరద నీటి వల్ల తమ ఉపాధికి అంతరాయం కలుగుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.