రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు

AP: రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. గత 4రోజులుగా దగ్గు, బలుబు జ్వరంతో బాధపడుతున్న మహిళకు పరీక్షలు చేయగా వైరస్ సోకినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండుకు చేరింది. కాగా, నిన్న విశాఖలో 28 ఏళ్ల మహిళకు కొవిడ్ సోకిన విషయం తెలిసిందే.