కుటుంబం ఆత్మహత్యపై సీపీఐ ఆగ్రహం
అన్నమయ్య: గాలివీడు మండలంలో అధిక వడ్డీ వేధింపుల కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీపీఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని సీపీఐ నేత సిద్దిగాళ్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డీ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని ఆయన కోరారు.