దారుణం.. మంగళసూత్రం కోసం హత్య
బెంగళూరులో దారుణం జరిగింది. ఉత్తరహల్లిలోని న్యూ మిల్లెనియమ్ స్కూల్ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఓ జంట.. మంగళసూత్రం కోసం ఇంటి ఓనర్ను దారుణంగా కొట్టి హత్య చేసింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు ప్రసాద్, అతని భార్య సాక్షి బంగారం కోసం హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు.