గుంతకల్లు జంక్షన్లో దళారుల దందా..!
ATP: గుంతకల్లు జంక్షన్లో రైలు ప్రయాణానికి సంబంధించిన తత్కాల్ రైల్వే టికెట్ల జారీ వివాదాలకు దారి తీస్తోంది. రిజర్వేషన్ కౌంటర్లో ఉదయం అర గంట మాత్రమే టికెట్లు విక్రయిస్తున్నారు. ఏసీ టికెట్లు ఉదయం 10గం, స్లీపర్ 11గం. విక్రయిస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని దళారులు ఒక్కో టికెట్పై రూ.100-200 వరకు అదనంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.