'ప్రతి సమస్యను పరిష్కరిస్తాం'

NLR: మనుబోలు మండలంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి అన్నారు. మనుబోలు వైయస్సార్ కూడలి వద్ద బుధవారం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నెల్లూరుకు రానున్నారని ఆయన పర్యటనకు కార్యకర్తలను భారీగా తరలిస్తున్నామన్నారు. బీజేపీ కార్యకర్తల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోతామన్నారు.