జనగామ మున్సిపల్ వ్యవహారాలపై సీఎంకు ఫిర్యాదు
జనగామ మున్సిపల్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార స్వామి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ ద్వారా శుక్రవారం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఖర్చులు, ఉద్యోగ నియామకాలు, టౌన్ ప్లానింగ్ అంశాల్లో పారదర్శకత లేదని ఆరోపించారు. ఈ అంశాలపై ఏసీబీ లేదా సీఐడీ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో కోరారు.